వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్‌..విప్‌ జారీ చేసిన జగన్‌ !

-

వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్‌ ఇచ్చారు జగన్‌. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్ జారీ చేసింది వైసీపీ పార్టీ. ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని విప్ జారీ చేసింది వైసీపీ పార్టీ. ఈ నెల 23వ తేదీల్లో పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేశారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు.

విప్ ధిక్కరిస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్ జారీ చేసింది వైసీపీ పార్టీ.

ఇక అటు… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అకాల వర్షాలపై సీఎం వైయస్‌.జగన్‌ సీఎంఓ అధికారులతో సమీక్షించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల్సిందిగా సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news