BREAKING : నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్.. ఫోటోలు వైరల్

-

నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. మీడియా ముందుకు వస్తే పచ్చి బూతులు తిడుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడతారు ధర్మపురి అరవింద్. ధర్మపురి శ్రీనివాస్ రెండో తనయుడే ఈ ధర్మపురి అరవింద్. అయితే 2019 ఎన్నికల్లో… నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని… హామీ ఇచ్చి విజయం సాధించాడు ధర్మపురి అరవింద్.

అంతేకాదు ఎన్నికల ప్రచారంలో పసుపు బోర్డు తీసుకువస్తానని… బాండ్ పేపర్ కూడా రాశాడు. కానీ ఇప్పటివరకు నిజామాబాద్ కు పసుపు బోర్డు రాలేదు. పసుపు బోర్డు తీసుకురాలేనని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈ తరుణంలోనే ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిజామాబాదులో కొన్ని పోస్టర్లు అలాగే హోర్డింగ్లు వెలిచాయి. మా ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ కు.. పసుపు బోర్డు తీసుకు వచ్చారని… పసుపు రంగు ఉన్న పోస్టర్లను పెట్టారు కొంత మంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news