ఐపిఎల్ లో రికార్డుల మోత… ఒక రోజులోనే అన్ని కోట్ల మంది !

-

ఐపిఎల్ సీజన్ 16 ఎంతో అంగరంగ వైభవంగా వేల ప్రేక్షకుల ముందు మార్చ్ 31 సాయంత్రం మొదలైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై మరియు గుజరాత్ లు పోటీ పడగా గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను జియో సినిమా యాప్ ద్వారా ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీ గా ప్రసారం చేస్తున్నారు. అందుకే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి దేశ వ్యాప్తంగా 2.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మన దేశంలో ఒక యాప్ ను ఎక్కువ మంది కేవలం ఒక రోజులో ఇన్స్టాల్ చేసుకున్న యాప్ గా జియో సినిమా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా నిన్న చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ క్రీజులోకి రాగానే 1.6 కోట్ల మంచి వీక్షించడం విశేషం. ఇలా ఐపిఎల్ మొదటి రోజే ఇన్ని రికార్డులను తిరగరాసింది. మరి ఇంకా రెండు నెలల పాటు జరగనున్న ఐపిఎల్ లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news