ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం..కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

-

ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలోనే, ఉదయం 10 గంటల కల్లా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని ప్రతినిధులకు పార్టీ సూచనలు చేసింది. ఇక ఇవాళ BRS పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం ఉన్న తరుణంలో తెలంగాణ భవన్ లో BRS జనరల్ బాడీ సమావేశం జరుగనుంది.

అయితే… ఇవాళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్న నేపథ్యంలో..మంత్రి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్ అని కొనియాడారు.22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news