నూతన సచివాలయానికి రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు

-

నూతన సచివాలయానికి వెళుతున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన నూతన సచివాలయానికి వెళుతున్న క్రమంలో టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు.

దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నూతన సచివాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో తనని సచివాలయంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అవసరమైతే పోలీసులే తనను సచివాలయంలోనికి తీసుకువెళ్లాలని అన్నారు. తను సచివాలయంలోకి వెళితే పోలీసులకు వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. తనని సచివాలయంలోకి అనుమతించే వరకు రోడ్డుపైనే కూర్చుంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news