ఆ వ్యక్తి కిడ్నీలో 154 రాళ్లు.. బిత్తరపోయిన వైద్యులు

-

Stones: ఈరోజుల్లో కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటర్‌ ఎక్కువగా తాగమని జనాలకు చెప్పినా పెద్దగా పట్టించుకోకపోవడం, బయట ఆహారాలు తినడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం..ఇలాంటి ఎన్నో తప్పుల వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఎంతో మందిని వేధిస్తుంది. ఓ వ్యక్తి కిడ్నీలో ఏకంవగా 154 రాళ్లను వైద్యులు గుర్తించారు.. కిడ్నీలో రాళ్లు చేరడం అనేది ఇప్పుడు అధికమైపోయింది. ముఖ్యంగా సరైన మోతాదులో నీళ్లు తాగక పోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

 

ఒక రోగి కిడ్నీ నుంచి ఏకంగా 154 రాళ్ళను వైద్యులు తొలగించారు. ఇన్ని రాళ్లు కిడ్నీలో పేరుకుపోవడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.. ఇది ఎక్కడో కాదు హైదరాబాదులోనే జరిగింది. ఆ రోగి రామగుండానికి చెందిన వ్యక్తి. ఎండోస్కోపీ ద్వారా కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.. అవి కరిగే స్థాయిని దాటి పోయాయి. కచ్చితంగా శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి. ఇందుకోసం రోగిని ఆపరేషన్‌కి సిద్ధం చేశారు. రాళ్లను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కిడ్నీ నిండా రాళ్లు నిండి పోయాయి. 154 రాళ్లలో ఒక రాయి పెద్దగా ఉంది, మిగతా 153 రాళ్లు చిన్న ఉన్నాయి. పెద్ద రాయిని పగుల గొట్టి చిన్న ముక్కలుగా చేశారు. అత్యంత సంక్షిష్టమైన ప్రక్రియ ద్వారా వాటిని తొలగించారు.

కిడ్నీలో రాళ్లు ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి..

ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చే అవకాశం ఉంది.
మూత్రం రంగు పింక్, ఎరుపు, గోధుమ రంగులో ఉంటుంది.
పొత్తి కడుపులో నొప్పి వస్తుంది.
పక్కటెముకల కింద, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
మూత్రవిసర్జన చిన్న మొత్తంలో వెళ్లాల్సి వస్తుంది.
మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో నొప్పి వస్తుంది.

రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఒక్క కారణం ఉండదు.. అనేక కారణాలు ఉన్నాయి. నీళ్లు సరిగా తాగకపోయినా రాళ్లు ఏర్పడతాయి.
కుటుంబ చరిత్రలో ఎవరికైనా రాళ్ల సమస్యా ఉన్నా కూడా వారసత్వంగా పిల్లలకు, మనవళ్లకు వచ్చే అవకాశం ఉంది.
ప్రొటీన్, సోడియం, చక్కెర వంటి ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు చేరిపోవచ్చు.
ఊబకాయం బారిన పడిన వారిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.
కొన్ని వైద్యు పరిస్థితులు అంటే రోగాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే ఛాన్సులు ఉన్నాయి.

ఎలా నిర్ధారిస్తారు?

కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ముందుగా రక్త పరీక్ష చేస్తారు. రక్తంలో ఎక్కువ కాల్షియం, లేదా యూరిక్ యాసిడ్ ఉంటే రాళ్లు చేరినట్టు అనుమానిస్తారు. తరువాత మూత్ర పరీక్షను నిర్వహిస్తారు.
రెండు మూడు రోజుల పాటూ మూత్ర పరీక్ష చేస్తారు.
ఇమేజింగ్ టెస్టు చేస్తారు. ఇందులో రాళ్లు సైజును తెలుసుకుంటారు.
చిన్న రాళ్లను మందుల ద్వారా కరిగిస్తారు. కరిగించే స్థాయిని దాటి రాళ్ల పరిమాణం ఉంటే వాటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news