కేటీఆర్‌కు రేవంత్ లాజికల్ కౌంటర్..అది వాస్తవమే.!

-

తెలంగాణకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్న విషయం  తెలిసిందే. నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఆమె వస్తున్నారు..ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ భారీ సభకు ప్లాన్ చేసింది..అలాగే ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించాలని చూస్తున్నారు. ఈ సభలోనే పలు కీలక హామీలని ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చూస్తున్నారు.

అయితే తెలంగాణకు ప్రియాంక గాంధీ వస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణపై కాంగ్రెస్ చేసిన రాజకీయం వల్ల అమాయకులైన యువత బలిదానాలకు పాల్పడిందని, కాబట్టి ముందు తెలంగాణకు క్షమాపణ చెప్పి అప్పుడు ప్రియాంక రావాలని కే‌టి‌ఆర్ అన్నారు. ఇక గాంధీభవన్ లో గాడ్సేని పెట్టుకున్నారని, సోనియాని బలిదేవత అని అన్న రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారని విమర్శలు చేశారు. ఇక తెలంగాణలో పోలిటికల్ టూర్ కాకుండా ఎడ్యుకేషన్ టూర్  పెట్టుకోవాలని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రియాంక నేర్చుకోవాలని కే‌టి‌ఆర్ కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలో కే‌టి‌ఆర్‌కు టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కే‌టి‌ఆర్ తనని గాడ్సేతో పోల్చడంపై ఫైర్ అయ్యారు..అసలు తెలంగాణ రాష్ట్రానికి గాని, తెలంగాణ ఉద్యమానికి కే‌టి‌ఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని, కే‌టి‌ఆర్ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అరువు తెచ్చుకున్నదే అని, తెలంగాణలో చదువుకోలేదని, తెలంగాణతో కే‌టి‌ఆర్‌కు పేగు బంధంగాని, పేరు బంధంగాని లేదని కౌంటర్ ఇచ్చారు. కే‌టి‌ఆర్ గుంటూరులో చదువుకుని, అమెరికాలో ఉద్యోగం చేశారని అన్నారు. అలాగే ఎన్టీఆర్ పేరునే కే‌టి‌ఆర్‌కు పెట్టారని అన్నారు. ఇక రేవంత్ చేసే విమర్శల్లో పాజిక్ ఉందనే చెప్పాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news