దారుణం: ఆస్తికోసం తల్లిని చంపాలనుకున్న దుర్మార్గుడు… !

-

నిన్న జరిగిన ఒక ఘటన ఆ ప్రాంత ప్రజలను ముక్కుని వేలేసుకునేలా చేస్తోంది. తెలంగాణ కామారెడ్డి జిల్లా బీర్కూరు లో పట్టపగలు పెద్ద ఘోరాన్ని తలపెట్టబోయాడు ఒక దుర్మార్గుడు. నిన్న బీర్కూరు లో చంద్రవ్వ అనే ఒక వృద్ధురాలు కొడుకు అశోక్ ఆస్తి కోసం తల్లితో గొడవపడి ఆమె ఎంతకూ వినకపోవడంతో చంపడానికి నిర్ణయించుకున్నాడు. దీనితో ఇంటికి నిప్పంటించాడు.. లోపల గ్యాస్ సిలిండర్ ఉండడంతో అది కూడా పెళ్లి లక్షల రూపాయల్లో నగదు నష్టం జరిగింది. ఇది ప్రమాదం అనుకుంటే.. అసలు కథ మళ్ళి బయటపడింది, బీర్కూరు కు చెందిన చంద్రవ్వ మరియు నారాయణ లకు పుట్టిన బిడ్డ అశోక్.. ఇతను ఉన్న ఊరును విడిచి పెట్టి హైద్రాబాద్ లో పెళ్ళాం మరియు పిల్లలతో జీవిస్తున్నాడు.

ఇక తండ్రి చనిపోవడంతో ఆస్తిపై కన్నేశాడు అశోక్.. ఎంత అడిగిన తల్లి ఆస్తిని ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో ఇంటికి నిప్పంటించి చంపాలనుకున్నాడు. కానీ చంద్రవ్వ తేరుకోవడంతో అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news