పల్నాడు జిల్లాలో ఆటోను ఢీకొన్న లారీ.. ఐదుగురు దుర్మరణం

-

ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందినవారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులుగా గుర్తించారు. కూలీలంతా గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news