WTC 2023 FINAL: ఇండియాకు బిగ్ షాక్… మరో ఆటగాడు దూరం కానున్నాడా ?

-

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ అనంతరం ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్యన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు పలువురు ఇండియా క్రికెటర్లు వివిధ కారణాలతో దూరమయ్యారు. దూరమైన వారిలో రిషబ్ పంత్, రాహుల్ , శ్రేయాస్ అయ్యర్, బుమ్రా గాయాల కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కాగా, శార్దూల్ ఠాకూర్ , జయదేవ్ ఉనాద్కట్ మరియు ఉమేష్ యాదవ్ లో ఫిట్నెస్ కారణంగా దూరం అయ్యారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో కీలక స్పిన్నర్ కూడా దూరం అయ్యేలా ఉన్నాడని తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ వెన్ను నొప్పి కారణంగా రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడలేదు.

అయితే ఈ గాయంపై అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఇంకా అశ్విన్ ఈ మ్యాచ్ కు ఉంటాడా లేదా అన్న విషయం తెలియడం లేదు. ఒకవేళ అశ్విన్ కు ఈ గాయం పెద్దదయ్యి దూరమైతే చాలా పెద్ద షాక్ అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news