బ్రేకింగ్‌ : తెలంగాణ‌ ఆర్టీసీ బస్సు బీభ‌త్సం… ముగ్గురు దుర్మరణం

-

ఆర్టీసీ బస్సు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ‌లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ జిల్లా బిచ్కుంద నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరో 10 మందికి గాయాలయ్యాయి.

వెంట‌నే వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను సంగారెడ్డి జిల్లా పులకల్ మండలం చోటాపూర్‌ గ్రామస్తులుగా గుర్తించారు. కాగా, అనుభవం లేదని తాత్కాలిక డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news