BREAKING : జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు

-

BREAKING : ఏపీ ప్రజలకు మరో షాక్‌ ఇచ్చింది జగన్‌ సర్కార్‌. జూన్ 1 నుండి ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ వ్యాప్తంగా నిన్నటి నుంచి నిలిచిపోయింది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. జూన్1 నుంచి అమల్లోకి పెరిగిన మార్కెట్ ధరలు రానున్నాయి. సర్వర్లు డౌన్ అవటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్లు జరగలేదు.

నేడు కూడా సర్వర్లు అందుబాటులోకి రావడం కష్టమే అంటున్నారు అధికారులు. ఇక అటు అనంతపురం జిల్లాలో కిటకిట లాడుతున్నాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు. అనంతపురం జిల్లాలో రెండవ రోజు ఆగిపోయాయి రిజిస్ట్రేషన్లు. నిన్న ఒక్క రోజు అర్భన్ పరిధిలో ఆగిపోయాయి 60 రిజిస్ట్రేషన్లు. సాంకేతిక సమస్యతో వెబ్ స్తెట్ తెరుచుకోలేదు. రివర్స్ ప్రింట్ రావడం లేదంటున్నారు అధికారులు. జూన్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ఛార్జీలు పెరుగుతుండడంతో కావాలనే సర్వరు ప్రాబ్లం చెబుతున్నారంటున్నారు కొనుగోలు దారులు.

Read more RELATED
Recommended to you

Latest news