జోరా పబ్ లో అటవీశాఖ అధికారుల తనిఖీలు

-

జొరా పబ్ లో అటవీ శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జోరా పబ్ లో వన్య ప్రాణుల విషయంలో పబ్ నిర్వాహకుడు వినయ్ రెడ్డి ని అదుపులోకి తీసుకుని అటవీ అధికారులకు అప్పగించారు జూబ్లీహిల్స్ పోలీసులు. వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు కేబీఆర్ ఉద్యానవనంకు తరలించారు అటవీ శాఖ అధికారులు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌ నిర్వహకులు ‘వైల్డ్ జంగిల్ పార్టీ’ పేరిట జరిపిన ఈవెంట్‌కు వన్యప్రాణులను పబ్బులో కస్టమర్ల ను ఆకర్షించేందుకు తీసుకొచ్చారు.

అయితే వన్య ప్రాణులను ఎటువంటి అనుమతి లేకుండా పబ్బులో నిర్వహించడంపై పబ్బు నిర్వాహకుడు వినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అటవీశాఖ అధికారులు. అటవీశాఖ అధికారిని అనురాధ ఆధ్వర్యంలో పబ్బుని, నిర్వాహకుని స్థానిక కేబి ఆర్ పార్కులో ఉన్న కార్యాలయంలో విచారణ నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news