చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చినా బీసీలు ఆయనని నమ్మరు – మంత్రి అంబటి

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లిలో తనను ఓడించేందుకు కొత్త వస్తాదులు వస్తున్నారని అన్నారు. అందుకే చంద్రబాబు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి కి వచ్చి మీటింగులు పెట్టారని.. తనని ఓడించాలనే పట్టుదలతోనే వీరు మీటింగులు పెట్టారనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.

తననే కాకుండా కొడాలి నాని, రోజాలను కూడా ఓడించేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్ని పాచికలు వేసిన ఆయనను బీసీలు నమ్మరని అన్నారు. అంబేద్కర్, పూలే ఆశయాల సాధన దిశగా జగన్ పాలన కొనసాగుతుందని తెలిపారు అంబటి రాంబాబు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి గెలుపుని ఎవరు ఆపలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news