ఈ నెల 17న హైదరాబాద్​కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-

తెలంగాణలో ఈ నెల వరుసగా ప్రముఖుల పర్యటనలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు ఖరారైన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. వచ్చే ఆదివారం రోజున ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు.

ఈ నెల 17వ తేదీన దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరగనున్న పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 16వ తేదీ సాయంత్రం ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం పాసింగ్ ఔట్ పెరేడ్‌లో పాల్గొని ఆ తర్వాత తిరిగి దిల్లీ పయనమవుతారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర సచివాలయంలో సమన్వయ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు సైనిక, వైమానిక అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news