హనుమంతుడు ఓ గిరిజనుడే – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

-

హనుమంతుడు గిరిజనుడేనని మధ్యప్రదేశ్ కు చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. దార్ జిల్లాలోని గాంధ్వనీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘర్ శుక్రవారం ఓ బహిరంగ సభలో ఈ వాక్యాలు చేశారు. “శ్రీరాముడిని లంకకు తీసుకెళ్లింది గిరిజనులే.

కొంతమంది రచయితలు వానరసేన తీసుకెళ్లిందని రాసినప్పటికీ అది వాస్తవం కాదు. అప్పటికి అడవిలో ఉన్నదంతా గిరిజనులు మాత్రమే. అందులో హనుమంతుడు ఒకరు. మనమంతా ఆయన వారసులమైనందుకు గర్వపడదాం” అని పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అర్జున్ సింగ్ కకోడియా కూడా ఇలాంటి వాక్యాలే చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news