ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం సభను నిర్వహిస్తాం – బండి సంజయ్

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయిన విషయం తెలిసిందే. బిఫర్ జాయ్ తుఫాన్ కారణంగా పరిస్థితులను దగ్గర నుండి సమీక్షించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తుఫాన్ ప్రధానంగా గుజరాత్ పైనే ప్రభావం చూపనుంది. దీంతో అమిత్ షా మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే తన పర్యటన ఆయన వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర బిజెపి నేతలకు అమిత్ షా సమాచారం అందించడంతో ఖమ్మం లో రేపు జరగవలసిన సభ ఏర్పాట్లను బిజెపి శ్రేణులు నిలిపివేశాయి.

ఈ విషయాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గుజరాత్ లో బిఫర్ జాయ్ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉండడంతో ముఖ్యఅతిథిగా రావలసిన అమిత్ షా హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. అయితే కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడవద్దని సూచించారు బండి సంజయ్. ఎట్టి పరిస్థితులలోనూ ఖమ్మం సభను నిర్వహిస్తామని చెప్పారు. సైక్లోన్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా సభలు ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news