తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పై మాజీమంత్రి బండారు సత్యనారాయణ కీలక ఆరోపణలు

-

తిరుమల శ్రీవాణి ట్రస్ట్ పై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్తే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి లు తనపై చర్యలు తీసుకుంటానని బెదిరిస్తున్నారని అన్నారు. 500 ఉన్న బ్రేక్ దర్శనం టికెట్ల ను శ్రీవాణి ట్రస్ట్ పేరిట 10వేలు చేశారు. 10 వేల టికెట్ ఎందుకు ఆన్ లైన్ లో అమ్మడం లేదని ప్రశ్నించారు.

తాను టికెట్ కొన్నా సరే వాటికి కనీసం రసీదు ఇవ్వలేదన్నారు. సంవత్సరానికి నా అంచనా 3000 వేల కోట్లు వచ్చి ఉంటుందన్నారు. కానీ 800 కోట్లు వచ్చాయని చెప్తున్నారని అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట వచ్చిన డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయో తెలియడం లేదన్నారు. ట్రస్ట్ పేరుతో సుబ్బారెడ్డి అకౌంట్ లో వేసుకుని, డబ్బులు మీ సొంత పేరుకి వేడుకుంటారా..? అని ఆరోపించారు టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news