కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తెలంగాణ బియ్యం భారీగా తరలింపు

-

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తెలంగాణ బియ్యం భారీగా తరలిస్తున్నారు. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం పట్టించు కోలేని… తెలంగాణ బియ్యానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో డిమాండ్ పెరిగింది. బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ అగ్ర స్థానానికి చేరుకోవడంతో పొరుగు రాష్ట్రాల నుండి భారీగా డిమాండ్ పెరుగుతోంది.

ఇటీవలే కర్ణాటక రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ నుండి 2.5 లక్షల టన్నుల బియ్యం కావాలని తెలంగాణ రాష్ట్ర కేసీఆర్‌కు ఫోన్ చేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. అదే బాటలో తమిళనాడు అవసరాల కోసం 3 లక్షల టన్నుల బియ్యం కావాలని లేఖ రాశారు సీఎం స్టాలిన్‌. తెలంగాణ బియ్యానికి డిమాండ్ ఏర్పడటంతో పెద్ద ఎత్తున మిల్లింగ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news