కేసీఆర్‌ కొడుకు, అల్లుడు, కూతురు, మనవడు తెలంగాణను పాలిస్తున్నారు – కేంద్ర మంత్రి

-

కేసీఆర్‌ కొడుకు, అల్లుడు, కూతురు, మనవడు తెలంగాణను పాలిస్తున్నారని ఆగ్రహించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోష్. నరేంద్రమోడీ ప్రభుత్యం వచ్చిన తర్వాత దేశంలో అభివృద్ధి జరిగిందని అందుకే మోడీ ప్రభుత్వాని దేశంలో అందరు అదరిస్తునట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోష్ అన్నారు. హైదరాబాద్ పర్యాటనలో భాగంగా శంషాబాద్ వద్ద నిర్మాణంలో ఉన్న ప్లైఒవర్ ను పరిశీలించిన అయన బస్టాండ్ లో మొక్కలు నాటారు.

అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ కి నివాళులర్పించారు…. అనంతరం శంషాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం అవసరమని అన్నారు. పైన మోదీ ప్రభుత్వము కింద బిజెపి ప్రభుత్వము అవసరమని వెల్లడించారు. ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కుటుంబం కొరకే పని చేస్తుందని అన్నారు. కెసిఆర్ కుటుంబంలోని కొడుకు, అల్లుడు, కూతురు, మనవడు రాష్ట్రాని పాలిస్తున్నారు. కానీ మోడీ ప్రభుత్వాన్ని భారతీయులందరూ సొంత ఇంటిలా భావిస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news