హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటి ఖుష్బూ.. ఆందోళనలో ఫ్యాన్స్..!

-

తాజాగా ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ మరొకసారి ఆస్పత్రిలో చేరడంతో ఆమెకు ఏమైందంటూ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తాజాగా హాస్పిటల్ లో చేరారు . టైల్ బోన్ చికిత్స పొందుతున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఇక ఈ మేరకు బెడ్ పై తాను పడుకున్న ఒక ఫోటోని షేర్ చేసి అభిమానులతో తను చికిత్స పొందుతున్న తీరును వెల్లడించారు. కోక్కిక్స్ (టైల్) బోన్ ట్రీట్మెంట్ కోసం మరొకసారి ఆసుపత్రికి వచ్చాను. ప్రస్తుతం కోరుకుంటున్నాను. నా ఈ అనారోగ్య సమస్య నుంచి త్వరలోనే నేను కోలుకుంటానని ఆశిస్తున్నాను అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

అయితే తాను ఏ హాస్పత్రిలో జాయిన్ అయ్యాను అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. హైదరాబాదులోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె జ్వరం, నీరసం, ఒళ్ళు, నొప్పులు ఇలా అన్ని వేధిస్తున్నాయని అదృష్టవశాత్తు తాను మంచి ఆసుపత్రిలో చేరానని వెల్లడించింది.

ఇక మీలో ఎవరికైనా కొంచెం ఆరోగ్యం బాగా లేకపోయినా దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఆమె తెలిపింది ఇక ఆరోగ్యం గురించి పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని.. నాడు తన అభిమానులకు హితువు పలికింది కానీ ఇప్పుడు మళ్ళీ ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news