యూపీలో దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురిని నరికి.. ఆపై గన్​తో కాల్చుకుని సూసైడ్

-

ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురి అతి కిరాతకండా నరికి చంపాడు ఓ యువకుడు. అనంతరం తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మైన్​పురి జిల్లాలోని గోకుల్​పుర్​లో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్​పుర్​కు చెందిన శివవీర్ యాదవ్​(30).. తన సోదరులు భుల్లన్ యాదవ్​​(25), సోనూ యాదవ్(21)​, సోనూ భార్య సోనీ(20), బావ సౌరభ్(23), స్నేహితుడు దీపక్​(20)ను గొడ్డలితో నరికి చంపేశాడు. వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం భార్య డాలీ, మేనత్తపై దాడికి పాల్పడి.. తనను తాను గన్​తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో గాయపడ్డ మేనత్త, భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగతా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. శివవీర్ ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందరూ నిద్రిస్తుండగా నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news