ఢిల్లీకి తెలంగాణ బీజేపీ బాస్ బండి సంజయ్…

-

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇక నిన్న అధికార పార్టీ నుండి వెళ్లిన పొంగులేటి మరియు జూపల్లి కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. దీనితో బీజేపీ అధిష్ఠానము లో వణుకు మొదలైంది. బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి ఎవరైనా వెలుతారా అన్న విషయంపై దృష్టిని సారిస్తున్నారు. బీజేపీలోనూ కొందరు అసంతృప్త నేతలు ఉండడంతో ఇప్పటికే వారితో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారు. తాజాగా బండి సంజయ్ కూడా ఢిల్లీ బయలు దేరినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ఢిల్లీలోని పార్టీ పెద్దలను మరియు కేంద్రమంత్రులను కలవనున్నారు.

ఇప్పటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు ఈటల రాజేందర్ లతో జరిగిన చర్చల సారాంశాన్ని బండితో చర్చించి దానికి ఏమి చేయగలం అన్న విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news