చంద్రబాబు అప్పుడు గాడిదలు కాశారా..? – మంత్రి అప్పలరాజు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి సీదిరి అప్పలరాజు. గతంలో చంద్రబాబు ప్రకటించింది మేనిఫెస్టో కాదని.. మోసఫెస్టో, మాయ ఫెస్టో అని అన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. 2014లో వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు పదుల సంఖ్యలో కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. పథకాలకు పేర్లు మార్చి అవే పదకాలు ఇస్తాననడానికి సిగ్గు లేదా..? అని విమర్శించారు.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపదను ఎందుకు సృష్టించలేదో చెప్పాలన్నారు. ఇప్పుడు గెలిపిస్తే సంపద చూపిస్తానని అంటున్నాడని.. మరి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా..? అని నిలదీశారు. చంద్రబాబు మొదటిసారి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని, మరో రెండు సార్లు మోసపూరిత మేనిఫెస్టోలతో ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో వృద్ధిరేటులో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news