నేడు రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో గ్రూప్‌-4 పరీక్ష

-

తెలంగాణలో ఇవాళ జరగనున్న గ్రూప్‌-ఫోర్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. నియామక పరీక్షల్లో అత్యధికంగా సుమారు తొమ్మిదిన్నర లక్షల అభ్యర్థులు రాయనున్న గ్రూప్-ఫోర్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 కేంద్రాలు సిద్ధం చేశారు. పరీక్షకు 15 నిమిషాల ముందుగానే గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది.

పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పేపర్-వన్‌ జనరల్ స్టడీస్… మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-టూ సెక్టరేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి.., మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంట నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

హాల్‌టికెట్‌తోపాటు ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు చూపించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. హాల్‌టికెట్‌పై ఫోటో లేకపోతే.. గెజిటెడ్ అధికారి సంతకంతో ఉన్న మూడు ఫోటోలతో రావాలని టీఎస్పీఎస్సీ సూచించింది. అభ్యర్థులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు, పర్సులు, మొబైల్ వంటి వాటికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ ధరించవద్దని నిబంధన పెట్టారు. ఓఎంఆర్ షీటుపై బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news