ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ లో మరిన్ని చేరికలు – మాణిక్ రావు థాక్రే

-

కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ఫలితాల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పెరుగుతోందని.. వచ్చే ఎన్నికలలో విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. బిఆర్ఎస్, బిజెపి నేతలు తమతో టచ్ లో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని అన్నారు. పార్టీలో నేతల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందని తెలిపారు. ఇక మహారాష్ట్రలో కేసీఆర్ ప్రయత్నంతో ఒరిగేదేమీ లేదన్న ఆయన.. అక్కడ బిఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఇక రేపు ఖమ్మం లో నిర్వహించబోయే జనగర్జన భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కాబోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news