ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం : రాహుల్ గాంధీ కీలక ప్రకటన

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపేందుకు త్వరలోనే ప్రియాంక గాంధీ అక్కడ పర్యటిస్తారని వెల్లడించారు.

ఖమ్మం పర్యటన ముగించుకొని నిన్న రాత్రి ఢిల్లీ వెళుతూ గన్నవరం ఎయిర్ పోర్టు ఏపీ నేతలతో మాట్లాడిన రాహుల్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ.తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌ బాధితులు, పైలేరియా, డయాలసిస్‌ రోగులకు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులకు రూ.4వేల పెన్షన్‌ అందిస్తామని రాహుల్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news