రాజగోపాల్ రెడ్డి : నేను ఎవరినీ కలవలేదు…

-

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు పడలేక మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటే పడక బీజేపీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా అవే సమస్యలు ఉండడంతో మళ్ళీ సొంతగూటికి వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశాడన్న వార్తలు కూడా రావడంతో త్వరలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు వెళ్లడం పక్కా అని అంతా డిసైడ్ అయ్యారు. ఇంతలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా మీడియా ముందుకు వచ్చి నా మీద వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాను.. నేను పొంగులేటిని కలిశాను అన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అన్నారు. నేను ఈ రోజు ఎవరినీ ఫామ్ హౌస్ లో కలవలేదన్నారు.

ఒక ఫంక్షన్ లో మాత్రమే కాంగ్రెస్ నాయకులు నాతో మాట్లాడారు అని క్లారిటీ ఇచ్చారు. నేను ఎవరినీ కలిసి దేని గురించి అయినా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news