మోడీ… తెలంగాణ పర్యటనను మేము బహిష్కరిస్తున్నాం – కేటీఆర్

-

BREAKING : ప్రధాని మోడీ పర్యటనకు BRS దూరం ఉంటుందని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. మోడీ ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు. మోడీ తెలంగాణ పర్యటనను మేము బహిష్కరిస్తున్నామని తెలిపారు. కుసుమ జగదీష్ , సాయి చంద్ కుటుంబాలకు మూడు కోట్ల రూపాయలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.

BRS ప్రజా ప్రతినిధులు వాళ్ల ఒక రోజు నెల జీతం ఇస్తారు…అన్ని కలిపి మూడు కోట్ల రూపాయలు అన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కెసిఆర్ ను ఎంతగానో కలిసిందని తెలిపారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news