“అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు” – కేసీఆర్ పై షర్మిల ఫైర్

-

“అర్హుల పొట్ట కొట్టు, బందిపోట్లకు పెట్టు” 10 ఏళ్లుగా దొర అమలు చేసిన ప్రతి పథకం తీరిదే అంటూ సీఎం కేసీఆర్‌ పై విరుచుకుపడింది వైఎస్‌ షర్మిల. పేదలకు దక్కాల్సిన స్కీంలన్నీ BRS దొంగల పాలవుతున్నయ్. డబుల్ బెడ్ రూం ఇండ్ల నుంచి దళిత బంధు వరకు అన్నీ అక్రమాలే అంటూ ఫైర్‌ అయింది. అన్నింట్లో బందిపోట్ల దోపిడీలే. ఏ పథకం పేదలకు అందలే.. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకే అన్నారు.

9 ఏళ్లుగా ఊరించి ఊరించి ఇచ్చిన అరకొర 4 లక్షల పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్ కో వదిలిపెట్టలే. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు. అర్హులను పక్కననెట్టి డబ్బులు ముట్టజెప్పిన వారికే పోడు పట్టాలు ఇవ్వడం కేసీఆర్ అండ్ బ్యాచ్ కే చెల్లింది. గిరిజనుల స్థానంలో బీఆర్ఎస్ లీడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పోడు పట్టాలు పొందడం దొరగారి పాలన దక్షతకు నిదర్శనం. YSR తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తోందన్నారు.

పోడు పట్టాల పంపిణీలో మీ డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీరు పంచిన 4 లక్షల ఎకరాల్లో పట్టాలు ఎంతమంది అర్హులకు ఇచ్చారు? ఎంతమంది అనర్హులకు కట్టబెట్టారు? ప్రభుత్వ ఉద్యోగులకు పట్టాలు ఇవ్వడం ఏంటి? గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారు? పట్టాల కోసం దరఖాస్తు పెట్టని వాళ్లకు ఎలా పట్టాలు ముట్టజెప్పారు? వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news