టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో పెదకూరపాడు లో బహిరంగ సభలో సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్. ఈ రాష్ట్రంలో సీఎం జగన్ ఒక వీధి రౌడీ అని .. అందుకే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయంటూ చెప్పాడు లోకేష్. ఇంకా జగన్ సారథ్యంలో మారణహోమం కూడా ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేశారు లోకేష్. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పే మాటలను విని టీడీపీ కార్యకర్తలు , నాయకులు మరియు నేతలపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపైన ఉన్న కేసులు అన్నటినీ కొట్టివేయిస్తామని నారా లోకేష్ చెప్పారు.
ఇంకా సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరించి టీడీపీ నాయకులను ఇబ్బందులు పెడుతున్న ఏ ఒక్క పోలీస్ ను వదిలే ప్రసక్తే లేదు అంటూ బహిరంగంగా నారా లోకేష్ చెప్పారు.