చిరంజీవికి సడన్‌గా ఏమైందో కానీ విషం చిమ్ముతున్నారు : రోజా

-

విశాఖను పాలనారాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు విషం చిమ్ముతున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తాజాగా విశాఖలో పవన్ పర్యటించడం, రుషికొండలో ఓవరాక్షన్ తదితరాలపై శనివారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.. ఇన్నాళ్లూ చిరంజీవి పెద్దమనిషిగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి అని భావించామని, కానీ సడన్‌గా ఆయనకు ఏమైందో కానీ జగన్‌కు సలహాలు ఇస్తూ విషం చిమ్మడం ప్రారంభించారని అన్నారు. ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మరోసారి తప్పుబట్టారు మంత్రి రోజా. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఏపీలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటామని ఎప్పుడైనా చెప్పారా? వారికి కనీసం ఆ ఆలోచన వచ్చిందా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.

Chiranjeevi: మంత్రి రోజా కి గట్టిగా ఇచ్చి పడేసిన మెగాస్టార్ చిరంజీవి!

కానీ జగన్ ఎమ్మెల్యేగా ఇడుపులపాయలో ఇల్లు నిర్మించుకొని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారన్నారు. జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించే ఉద్ధేశ్యంతో ముందుకు సాగారని, ఎన్ని కష్టాలు, అవమానాలు, నిందలు వచ్చినా భరించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి వాటిని తీరుస్తానని భరోసా ఇచ్చారని, ఇప్పుడు అందుకు అనుగుణంగా పని చేస్తున్నారన్నారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news