నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే – చంద్రబాబు

-

ఇటీవలే కన్నుమూసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భయం అంటే తెలియని వ్యక్తి గద్దర్ అని అభివర్ణించారు. 1997లో గద్దర్ పై కాల్పుల ఘటనపై స్పందించారు చంద్రబాబు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్ తనతో అనేకసార్లు మాట్లాడారని తెలిపారు.

నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒకటేనని అన్నారు. పేదల హక్కుల పరిరక్షనే మా ధ్యేయం అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలిసన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర చాలా కీలకం అన్నారు. ప్రజాయుద్ధనౌక పేరు వింటే గద్దర్ గుర్తుకు వస్తారని అన్నారు చంద్రబాబు. గద్దర్ జీవితం భావితరాలకు ఆదర్శం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news