సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ కౌంటర్…తడి గుడ్డతో గొంతు కోశాడు !

-

సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో తన అనుచరులు, ముఖ్య నేతలతో యార్లగడ్డ వెంకట్రావ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ.. నేను టికెట్ కావాలని అడిగితే పార్టీ పెద్దలకు ఏం అర్థం అయిందో నాకు తెలియటం లేదు…వైయస్ ఉండి ఉంటే నాకు ఇలా జరిగేది కాదు అని అందరూ అంటున్నారని వెల్లడించారు. నేను వైయస్ ఉంటే పార్టీ ఎలా ఉంటదో అలానే ఉంటది అనుకున్నానని చెప్పారు.

సజ్జల వ్యాఖ్యలు బాధకు గురి చేశాయని.. KDCC బ్యాంక్ ను అభివృద్ది చేసినా పనికి రాను అని పక్కన పెట్టారని వెల్లడించారు. టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీకి అభివృద్ది చేశానని.. గన్నవరం అభ్యర్ధిగా నేను సరిపోను అని అన్నారన్నారు. వైసీపీ పార్టీకి ఇంత పని చేస్తే నాకు ఈ దుస్థితి వస్తుందని అనుకోలేదు… 2019లో సరిపోయిన నా బలం… మూడేళ్లుగా నాకు ప్రత్యామ్నాయం చూపలేదని పేర్కొన్నారు. తడి గుడ్డతో గొంతు కోయటం నాకు జరిగిందని.. టీడీపీ నుంచి గెలిచి వచ్చిన వారి రావటమేనా పార్టీ బలం అంటూ సజ్జల వ్యాఖ్యలపై యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news