జగన్ ను తెలంగాణ విద్యార్థులంతా రాళ్లతో తరిమి కొట్టారు – పవన్ కళ్యాణ్

-

మూడోవిడత వారాహి యాత్ర సక్సెస్ అయ్యింది.. ప్రభుత్వంపై కోపం, జనసేన పోరాటం ప్రజల్లో కనిపించింది.. తెలంగాణ నుంచి ఆంధ్రావాళ్లను తరిమి వేయాలనే కోపం పెరగడానికి వైఎస్‌ జగన్ కూడా ఓ కారణం అన్నారు. ముఖ్యంగా తెలంగాణ సహజ వనరులను భూములను వైఎస్సార్ ఫ్యామిలీ దోచుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పర్యావరణాన్ని నాశనం చేసి సహజ వనరులను దోచుకున్నాడు. అలాగే ఆంధ్రాలో కూడా వైఎస్ జగన్ కూడా అక్రమంగా దోచేసుకుంటున్నాడు.

అందుకే జగన్ వరంగల్ స్టేషన్లో దిగుతుంటే తెలంగాణ విద్యార్థులంతా రాళ్లతో తరిమి కొట్టారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.   అందుకే వరంగల్‌లో విద్యార్థులు తరిమికొట్టారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్‌ కల్యాణ్‌. ఉత్తరాంధ్రను గుప్పెట్లో పెట్టుకోవడానికి తప్ప విశాఖ రాజధానిపై పాలకులకు ప్రత్యేకమైన ప్రేమ లేదు.. జనవాణిలో వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూదోపిడీలకు సంబంధించినవే.. ఉత్తరాంధ్రపై నాకు అపారమైన ప్రేమ ఉందన్నారు. తాను సున్నితంగా కనిపించవచ్చు కానీ ప్రజల కోసం వ్యక్తిగత దూషణలను భరించడానికి నేను సిద్ధం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news