చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదు : వెల్లంపల్లి

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ అండతోనే చంద్రబాబు గెలుపొందారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడుకు తన రాజకీయ జీవితంలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబును చూసి ఎవరూ టీడీపీకి ఓటు వేయరని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు… ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు ఏముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Minister Vellampalli Srinivas Comments On Chandrababu - Sakshi

ప్రజలతోనే తమ పొత్తు అని సీఎం వైఎస్ జగన్ చెప్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పొత్తుల కోసం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి ఢిల్లీలో చిల్లర రాజకీయాలకు చంద్రబాబు తెరలేపారని ఆరోపించారు. నరేంద్రమోడీ, అమిత్ షాల ప్రాపకం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. వదిన పురంధేశ్వరిని అడ్డు పెట్టుకుని మళ్లీ బీజేపీకి దగ్గర కావాలని వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news