షారుఖ్ ఖాన్ ను కలిసిన గౌతమ్ గంభీర్ .. లక్నో ను వీడనున్నాడా !

-

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన షారుఖ్ ఖాన్ కు ఈ సంవత్సరం కెరీర్ పరంగా చాలా బాగా కలిసి వచ్చింది. సంవత్సరం మొదట్లో విడుదలైన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది షారుఖ్ ఖాన్ కి, ఈ సినిమా బాలీవుడ్ కు కూడా ఊపిరి పోసిందని చెప్పాలి. ఆ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన జవాన్ మూవీ సైతం 900 కోట్లకు పైగా కలెక్షన్ లను సాధించి థియేటర్ లలో ఇంకా ప్రదర్శితం అవుతోంది. ఎందరో ఈ సినిమాను గృయించి షారుఖ్ ను మరియు డైరెక్టర్ అట్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాజీ ఇండియన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షారుఖ్ ను కలిశాడు. వీరిద్దరూ కలిసి ఫోటో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ టీం కు సహా యజమాని అన్న విషయం తెలిసిందే. గతంలో గౌతమ్ గంభీర్ రెండు టైటిల్స్ ను అందించారు.. అందుకే గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ లోకి వెల్లనున్నాడా అన్నది సందేహం అందరిలోనూ ఉంది.

ప్రస్తుతం లక్నో లో మెంటర్ గా ఉన్న గంభీర్ ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ లక్నో యాజమాన్యం వెంటనే స్పందించి ఈ వార్తలో నిజం లేదు. వీరిద్దరూ జవాన్ సినిమా కోసం కలిశారు అంటూ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news