చంద్రబాబు చీటర్.. జగన్ లీడర్ : మంత్రి రోజా

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ హయాంలోనే అభివృద్ది జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 2,50,864 కోట్లరూపాయలు  మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం కేటాయించింది.  మహిళా సాధికారత గురించి మాట్లాడేటప్పుడు గతానికి ఇప్పటికీ తేడాను పరిశీలించాలి. చంద్రబాబుకే భవిష్యత్ లేదు. కొన్ని విషయాలు తెలియడం లేదు. ఆడ బిడ్డల కష్టాలు సీఎం జగన్ కు తెలుసు అన్నారు.

దాదాపు 45 ఏళ్లలో చేయలేదని.. జగన్ 40 ఏళ్లలో చేసి చూపించాడు. నాలుగున్నరేళ్లుగా ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లను తుడిచారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అన్నారు మంత్రి రోజా. చంద్రబాబుది భోగస్ ఆలోచన అని.. చంద్రబాబు చీటర్.. జగన్ లీడర్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థతో మహిళలకు జగన్ అనేక పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  చంద్రబాబుది భోగస్ ఆలోచన అన్నారు మంత్రి రోజా. ఇవాళ ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. కసాయి వాడిని గొర్రెలు నమ్ముతాయేమో కానీ.. చంద్రబాబును మాత్రం జనాలు నమ్మరని పేర్కొన్నారు. మహిళా మంత్రిగా తాను గర్వపడుతున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news