నేను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటే కానీ నష్టం వారికే: సీఎం కేసీఆర్

-

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలకు చెమటలు పడుతున్నాయి. సర్వే ఫలితాలు అన్నీ కూడా సీఎం కేసీఆర్ కె అనుకూలంగా రాగా, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విశ్వసనీయత పెరిగినట్లుగా సమాచారం బలంగా ఉంది. ఈ రెండు పార్టీలలో ఒకటే అధికారాన్ని ఏర్పాటు చేయనున్నది ఖచ్చితం. కాగా తాజాగా సీఎం కేసీఆర్ అచ్చంపేట సభలో మాట్లాడుతూ ఎన్నికల ఫలితం ఏ విధంగా వస్తుందో అన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కనుక మమ్మల్ని ఓడిస్తే రెస్ట్ తీసుకుంటామని చాలా కామెడీ గా కామెంట్ చేశాడు.. కానీ ఇక్కడ మరో తిరకాసు పెట్టాడు ప్రజలకి, మమ్మల్ని ఓడిస్తే మేము హాయిగా ప్రతిపక్షములో ఉండి రెస్ట్ తీసుకుంటాము.

కానీ…మేము కాకుండా ఇంకెవరు గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం నష్టపోయేది ప్రజలే అంటూ కేసీఆర్ ప్రజలకు సరైన ప్రశ్నను సంధించాడు. ఇప్పుడు ప్రజలు అసలు వారి అభివృద్ధికి ఏ పార్టీ మంచిది అంటూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news