కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడక : షర్మిల

-

ధరణి పోర్టల్‌​పై వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. ‘కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుంది. స్వయానా ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువొచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా, సర్వే నెంబర్లు మార్చి చూపించే మాయాజాలమే ధరణి.గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు ఏ ఊరిలో చూసినా ధరణి గోసలే.ఈ తిప్పలు తప్పాల్నంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చివాత పెట్టుడు ఒక్కటే పరిష్కారం’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.

YS Sharmila: Telangana Assembly Elections: Sharmila-led YSRTP withdraws  from poll fray, to support Congress - The Economic Times

తహసీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా అందరికీ ధరణి బాధలే ఉన్నాయన్నారు. రైతుల భూములను గుంజుకొని, కోర్టుల చుట్టూ తిప్పుతూ ధరణే దైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలన్నారు. భూవివాదాల కోసం కాదు.. ముమ్మాటికి దొర భూదోపిడీ కోసమే తెచ్చుకున్న పథకం ధరణి అని పేర్కొన్నారు. బందిపోట్ల ఆస్తులను పెంచడానికి అమలు చేసిన పథకం ఇది అని ఆరోపించారు. ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టుడు ఒక్కటే మార్గం అన్నారు. ఈ ఎన్నికల్ల కారుకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఒక్కటే పరిష్కారమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news