సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు – నారా లోకేష్

-

సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అంటూ నారా లోకేష్ ట్వీట్‌ చేశారు. మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయిందన్నారు. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశాడని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతుల్ని హింస పెట్టాడు.

రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించాడని నిప్పులు చెరిగారు లోకేష్‌. ఇన్ని చేసినా ప్రజారాజధాని అమరావతిని ఇంచు కూడా కదపలేకపోయాడు. సైకో జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుందన్నారు. రైతుల త్యాగాల పునాదులపై వెలిసిన ప్రజారాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని..జై అమరావతి..జై ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌.

అలాగే,టీటీడీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేష్ చెప్పారు. ప్రభుత్వం మారిన వెంటనే వారికి బదులు తీరుస్తానని హెచ్చరించారు. యలమంచిలిలో మాట్లాడుతూ…. “చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టడాన్ని నేను మర్చిపోను. సైకోను సింహం ఎలా వేటాడుతుందో చూస్తారు” అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news