చంద్రబాబును చెప్పుతో కొడతానన్న టీడీపీ కార్యకర్త !

-

చంద్రబాబును చెప్పుతో కొడతానని టీడీపీ కార్యకర్త హెచ్చరించారు. అరకులోయ టీడీపీలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకున్నాయి. యువగలం పాదయాత్ర విజయవంతం కోసం మాజీమంత్రి నక్క ఆనందబాబు నిర్వహించిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు.

టిడిపి నేత సివేరి అబ్రహంకు న్యాయం చేయాలంటూ కొందరు రభస చేశారు. పార్లమెంటరీ ఇంచార్జి కిడారి శ్రావణ్ వారించినా వినలేదు. ఈ క్రమంలో చంద్రబాబును చెప్పుతో కొడతానని ఓ కార్యకర్త చేసిన వాక్యాలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా, జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ చర్చలు జరిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, బీజేపీతో పొత్తు వంటి అంశాలపై చర్చించారు ఇరువురు నేతలు. ఈ తరుణంలోనే.. జనసేన కు 24 సీట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 24 సీట్లు కేటాయిస్తున్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అలాగే.. రెండు ఎంపీలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

https://x.com/TeluguScribe/status/1736639901662429206?s=20

Read more RELATED
Recommended to you

Latest news