అవిశ్వాసానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నం.. మొదలైన ముసలం..!

-

మెజార్జీ మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానం కోసం కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రయత్నం చేస్తున్నారు. నస్పూర్ , లక్షెట్టిపేట,బెల్లంపల్లి అలానే మంచిర్యాల మున్సిపాలిటిల్లో అవిశ్వాస ప్రయత్నాలు జరుగుతున్నాయి. చేజిగ్గించుకోవడానికి కాంగ్రెస్ చూస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కలెక్టర్ కి నోటీసులు కూడా ఆయా మున్సిపాలిటిల కౌన్సిలర్లు ఇచ్చారు. అయితే ఈ నెల 11న మంచిర్యాల లో బల పరీక్ష. 36 మంది కౌన్సిలర్స్ ఇక్కడ ఉండగా, వీళ్లల్లో 26 కాంగ్రెస్ వాళ్లున్నారు.

12 వ తేదీన బెల్లం పల్లి ,నస్పూర్ మున్సిపాలిటిల్లో విశ్వాస పరీక్ష. నస్పూర్ లో 25 మంది కౌన్సిలర్లు ఉంటే, కాంగ్రెస్ వాళ్ళు 19 మంది వున్నారు. బెల్లంపల్లి లో 21 మంది ఉండగా 12 మంది ఏమో కాంగ్రెస్ వైపు ఉన్నారు. లక్షెట్టి పేట మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కలెక్టర్ కి నోటీసులు ఇచ్చారు. లక్షెట్టి పేట లోని మొత్తం 15 మంది కౌన్సిలర్లు ఉంటే, 10 మంది కాంగ్రెస్ వైపు ఉన్నారు. పాలక వర్గాల మార్పు కోసం కాంగ్రెస్ చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news