దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా..!

-

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది వచ్చే సోమవారానికి క్రిష్ ముందస్తు బెయిల్ విచారణని హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసులు కృష్ణ నిందితుడిగా చేర్చారు డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. దీంతో క్రిష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

డ్రగ్స్ కేసుతో అతనికి సంబంధం లేదని ఈ కేసులో తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వివేకానంద స్టేట్మెంట్ ఆధారంగా తనని నిందితుడని డ్రగ్స్ తీసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు ఈ పిటిషన్ మీద ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు కేసు కు సంబంధించి వివరాలు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసుల్ని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news