బీజేపీని టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంతా చూశారు : మంత్రి బొత్స 

-

బీజేపీని టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంతా చూశారు అని ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా బీజేపీ నేతలు చంద్రబాబు నాయుడిని కట్టప్పతో పోల్చారు. రెండు పార్టీలు కలవడం.. రెండు పార్టీలు విడిపోవడం అది సాదారణమే. కానీ బీజేపీ-టీడీపీ నేతలు రెండు, మూడు నెలల కిందట కూడా తిట్టుకున్నారని గుర్తు చేశారు. అధికారం మీద కాదు ముఖ్యం.. చరిత్రలో తన పేరు కూడా ఉండాలని కోరుకుంటాను అని సీఎం జగన్ చెప్పారు. దానిని వక్రీకరించుకొని టీడీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. ఛాలెంజ్ కోసమే సీఎం జగన్ అలా మాట్లాడారు. 

Botsa Satyanarayana Undergoes Heart Surgery In Hyderabad

ఆత్మ స్థైర్యంతో మాట్లాడిన మాటలు అవి. కానీ చంద్రబాబు నాయుడు లాగా పిరికి మాటలు కావు అన్నారు బొత్స. ఏది ఏమైనప్పటికీ కూడా 175 కి 175 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్ర జీడీపీ పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. రైతు హాయిగా ఉన్నాడు. ఆర్థిక స్థోమత పెరిగింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీఎం జగన్ అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. గ్రామాల్లో ఇంటివద్దకే పరిపాలన వచ్చిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news