ఈ నెల 25న తెలంగాణకు అమిత్ షా

-

ఈ నెల 25వ తేదీన తెలంగాణకు అమిత్ షా వస్తున్నారని ప్రకటించారు కిషన్ రెడ్డి. యూసుఫ్ గూడ కృష్ణానగర్ లో జైన్ మందిర్ ను సందర్శించిన కిషన్ రెడ్డి..అనంతరం మాట్లాడుతూ…ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో సభ ఏర్పాటు చేస్తామని… జాతీయ నేతల సభలు ఉంటాయి.. ప్రచారంలో పాల్గొంటారని వెల్లడించారు. మోడీ కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారు..సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.

ఈ నెల 25న తెలంగాణకు అమిత్ షా

కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు..కేసీఆర్ పని అయిపోయిందని విమర్శలు చేశారు. కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసిన కూడా ప్రజలు నమ్మరు.. ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసింది.. వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహించారు. హామీల పేరు చెప్పుకుని.. అధికారంలోకి రాగానే మోసం చేసిందని నిప్పులు చెరిగారు.

మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేం..దేశానికి ఎవరు ప్రధాని కావాలో.. ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించే ఎన్నికలు ఇవి అని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే మనం కొనసాగాలి..దేశంలోని అనేక సమస్యలను మోడీ పరిష్కరించాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news