పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి

-

ఈ మధ్య కాలంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొంత మంది కారణంగా అమాయకులు బలి అవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఎన్ని సార్లు చెప్పినా వాహనదారులు మాత్రం పెడచెవిన పెట్టడం లేదు. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. పెద్దపల్లి జిల్లా మియాపూర్ మండలంలోని చిన్నబొంకూరుకు చెందిన మహిళా కూలీలు మియాపూర్ లో మక్కా పెరట్లో పనిచేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళ కూలీలు రాధమ్మ, లక్ష్మి, వైష్ణవిలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news