చంద్ర‌బాబుకు మ‌రో షాక్‌.. వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత‌..

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నేత ఒకరు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువరు కీలక నేతలు పార్టీని వీడి.. కొందరు వైసీపీ, మరికొందరు బీజేపీలో చేరారు. కాగా… ఇప్పుడు మరో కీలక నేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అదీ టీడీపీ బలంగా ఉన్న విశాఖపట్నంలోనే. ఆ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు రెహమాన్ తన పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు.

ఈ నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాజధానిపై టీడీపీ చర్యను నిరసిస్తూ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. NRC విషయంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలవడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రెహమాన్ వెల్లడించారు. అటు.. మరికొంత మంది విశాఖ నేతలు కూడా టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news