అలా చేస్తే..రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దమ్ముందా..?: సీఎంకు ఎమ్మెల్యే హరీష్ బాబు సవాల్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన సవాల్ విసిరారు. ఒక్క రోజు కేంద్రం రాష్ట్రానికి సహకారం నిలిపేస్తే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.నిధులు కేంద్రానివి, ప్రచారం రాష్ట్రానిది అని ,బడ్జెట్‌కు వ్యతిరేకంగా తీర్మానం పెట్టడం బాధాకరం అని అన్నారు. అసెంబ్లీలో కేంద్రంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.

ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్నారని ,తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో ఎన్నో అంశాలు పెట్టారని.. కేంద్రంలోని బీజేపీ మన హక్కులను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.27న ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. తెలంగాణ హక్కులకు కేంద్రం భంగం కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ‘కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి అన్యాయం’ తీర్మానాన్ని వ్యతిరేకించిన కమలం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నుంచి వాకౌట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news