ఒలింపిక్స్ : మరో ఫైనల్ లో మను భాకర్..!

-

ఒలింపిక్స్ 2024 లో ఇప్పటివరకు భారత్ కు మూడు మెడల్స్ వచ్చాయి. అయితే ఆ మూడు కూడా షూటింగ్ లోనే రాగ.. అందులో రెండు భారత యంగ్ మహిళా షూటర్ మను భాకర్ సాధించింది. మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ అలాగే మిక్డ్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకాలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో మెడల్ వైపు అడుగులు వేస్తుంది.

తాజాగా జరిగిన 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో ఫైనల్స్ లో ప్లేస్ సంపాదించింది. మొత్తంగా 600 పాయింట్స్ కు గాను 590 పాయింట్స్ తో క్వాలిఫికేషన్ లో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇదే ఈవెంట్ లో హైదరాబాద్ కు చెందిన ఈషా సింగ్ 581 పాయింట్స్ తో 18 వ స్థానం నుండి వెనుదిరిగింది. ఇక ఈ ఈవెంట్ యొక్క ఫైనల్స్ రేపు మధ్య్నహం ఒంటి గంటకు ప్రారంభం కానుంది. మరి ఇందులో కూడా మను పోడియం ఫినిష్ చేసి హ్యటిక్ మెడల్స్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news